home sitemap contact www.apmlas.com menu
Search
search
Photo Gallery
Flood Rescue Work in AP
In Memory of our Ex CM Dr. Y.S Rajasekhara Reddy
MLAs Swearing-In Cermony 2009
MLAs Contact Info
Useful Links
Government Links
Media Links
Political Parties
Hits Counter
free html visitor counters
 
సీఎల్పీ నేతగా కె.రోశయ్య ఏకగ్రీవ ఎన్నిక
 

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ శాసనసభాపక్ష నేతగా ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఏఐసీసీ పరిశీలుగా హాజరైన కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ మీడియా ముందుకు వచ్చి ప్రకటించారు. వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి సీఎల్పీ నేతగా రోశయ్య పేరును తొలుత ప్రతిపాదించగా, సమావేశానికి హాజరైన పార్టీ ఎమ్మెల్యేలు, విధాన సభ సభ్యులు, ఎంపీలందరూ ఏకగ్రీవంగా ఆమోదించారని ఆయన తెలిపారు.

అతకుముందు దివగంత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి దుర్మరణం పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి, సంతాపం తీర్మానం చేసినట్టు ఆయన తెలిపారు. వీటితో పాటు.. హెలికాఫ్టర్ ప్రమాదంలో మృత్యువాత పడిన సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, ప్రిన్సిపల్ కార్యదర్శి, పైలట్, కో-పైలట్ మృతి పట్ల, అలాగే, ఐదు జిల్లాల్లో సంభవించిన వరదల కారణంగా మరణించిన వారికి కూడా సంతాపం తెలుపుతూ తీర్మానాలు చేసినట్టు ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు.

అంతకుముందు.. అసెంబ్లీ పాత హాలులో కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం జరిగింది. ఇందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ సభ్యులు హాజరుకాగా, కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీ, ముఖ్యమంత్రి రోశయ్య, పీసీసీ చీఫ్ డీఎస్ తదితరులు హాజరయ్యారు. ఆ తర్వాత పలువురు నేతలు వైఎస్ చేసిన సేవలు, అభివృద్ధి పనులను ప్రస్తుతిస్తూ ప్రసంగించారు.

Some More News
మదర్‌ థెరెసా గౌరవార్థం అమెరికా పోస్టల్‌ ĸ
తెలంగాణ వస్తే ఉప ముఖ్యమంత్రి ముస్లీంలకు
బోదనా ఫీజులు చెల్లించడానికి సర్కారు సిద్
అసెంబ్లీలో మెరుపు ధర్నా
సర్కారును అస్థితరపరిచేందుకు కుట్ర
అర్హులైన వారికి సంక్షేమ పథకాల ఫలితాలు
హైదరాబాద్‌ మెట్రో రైల్ దేశానికే మణిహారం
గ్రూప్1 పరీక్షను రద్దు చేయాలి: కేసీఆర్
more news >>
Copyrights Reserved@apmlas.com Powered By